Menu

        To Read Rera Act, 2016, select Muncipal related, scroll down and select RERA Act

Saturday, January 28, 2017

Who is Brahmin

🔔బ్రాహ్మణుడు’ అంటే ఎవరు?🔔

‘బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః’ అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన పూర్వీకులు.
ఆ|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
       నిజముశూద్రుకంటె నీచతముడు
       సత్య శౌచధర్మశాలి శూద్రుండయ్యు
       నతడు సద్ద్విజుండ యనిరి మునులు
                                                  – ‘శ్రీమహాభారతం’

సీ|| ఎవ్వడు సత్యంబు నెప్పుడు బల్కు, హింసావిదూరుడు గురుజనహితార్థి
       యింద్రియంబులనోర్చి ఎల్లవారల దనయట్ల జూచు ధర్మాభిరతుడు
       కామంబు తగులండు కర్మంబులారును, సముచిత సంప్రయోజతనొనర్చు
       అట్టి పుణ్యాత్ముని అనఘబ్రాహ్మణుడని యనిశంబు గీర్తింతురమరవర్యు.
ఆ|| లార్జవంబు శమము నధ్యయవంబును
       పరమధనముసువ్వె బ్రాహ్మణునకు
       ధర్మగతికి ననియు తగు సాధనంబులు
       వేదవిహితముఖ్యవిధులు నెనయె
                                                           – శ్రీమహాభారతం – అరణ్యపర్వం

శ్లో|| జన్మవా బ్రాహ్మణోజ్ఞేయః, సంస్కారైః ద్విజ ఉచ్యతే!
       విద్వత్వాచ్చాపి విప్రత్వం త్రిభిశ్శోత్రియ ఉచ్యతే|| – ‘ధర్మశాస్త్రం

      “చాతుర్వర్ణం మయాసృష్టం గుణభేద విభాగశః”
                                                     – భగవద్గీత

శూద్రునకు జన్మించినవారు శూద్రుడు కాగలడుగాని బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం. వేదమూ, పురాణాలు, శ్రుతులు, స్మృతులు కూడా ఇదేమాట చెబుతున్నాయి. బ్రాహ్మణుని “ద్విజుడు” అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సారులు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగింది. రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది.

బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు. బ్రాహ్మణుడుగా జీవించటం గొప్ప!
సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మమూ ఈవిషయాన్ని నొక్కిచెప్పాయి.
సమస్త బ్రాహ్మణకులానికి గాయత్రీ మంత్రాన్ని రచించి చెప్పిన శ్రీ విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి శ్రీరాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య – కూర్మ – వరాహ – నారసింహాది అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు.

వేదాలలో ఎక్కడా కులప్రసక్తి లేదు.
జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూచుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకొనకూడదు. బహుభార్యాత్వాన్ని కలిగి వుండరాదు. సుఖాభిలాష వుండకూడదు. పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం సేవించకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశప్రయాణం చేయకూడదు. ఇతర ఆహారపదార్ధాలు భుజించకూడదు. ఇతర సంస్కృతిని అన్యదేశ వస్తువులను ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోనూ కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్ధం చెప్పకూడదు. ధనాన్ని, సుఖాలనూ అభిలషించకూడదు. స్త్రీలవంక నిశితంగా చూడకూడదు. ఆహారాలనూ, వస్తువులనూ, కాఫీ వంటి విదేశ పానీయాలను ముట్టకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించకూడదు. ప్రాణులను కర్రతోగాని, రాయితోగాని కొట్టకూడదు. ఏ విధమైన వ్యాపారాలు చేయకూడదు. గోష్పాదం (పిలక) లేకుండా వుండకూడదు. సినిమా నాటకాలు మున్నగునవి చూడకూడదు. ఏకపత్నీవ్రతాన్ని తప్పక పాటించాలి. సర్వజన శాంతి సుఖాల కోసం దేవుని ప్రార్థించాలి. దైవ ప్రార్ధనలో తన స్వార్ధం విడచి జనహితాన్ని కోరుకోవాలి. జనహితంకోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి. మనస్సు, మాట, శరీరం, పని లోకహితార్ధమై వుండాలి. నేలమీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి – బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు వున్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించి నమస్కరించాలి.

ధార్మిక లక్షణాలున్నవారెవరైనా బ్రాహ్మణులే!
‘బ్రాహ్మణ్యం’ కులసంకేతపదం కాదు. గుణసంకేత పదం.
‘బ్రాహ్మణాయ నమోనమః’
బ్రహ్మజ్ఞానాయ నమోనమః

Thursday, January 19, 2017

Glory of Cow

గోమహిమ అపారమైన విజ్ఞానంతో వేదములు మొదలుకొని, వేదాధారమైన అన్ని గ్రంథాలలోనూ కనపడుతున్నది. ఇటు వైద్యగ్రంథాలలోను, అటు ధర్మశాస్త్ర గ్రంథాలలో కూడా గోప్రశస్తి గోచరిస్తోంది.

 “యూయం గావో మేదయథ కృశం చిదశ్రీరం చిత్కృణుథా సుప్రతీకమ్ |భద్రం గృహం కృణుథ భద్రవాచో”

 – ఈ వేదమంత్రమునందు చెప్తున్న అంశము కృశించిన శరీరము గల వారికి నీవల్లనే హృష్ట, పుష్ట శక్తి వస్తున్నది అని. హృష్ట అంటే మనస్సుకు సంబంధించిన ఆనందం, పుష్ట అంటే శరీరానికి కావలసిన ఇంద్రియ పటుత్వం. ఈ రెండూ కూడా నీవల్లనే వచ్చాయమ్మా అని గోవును కీర్తించారు ఇక్కడ. అంటే గోక్షీరాది గవ్యముల వల్ల లభిస్తున్నది శారీరక పుష్ఠి, మానసిక తుష్టి. ఈ రెండూ ఇవ్వగలిగే శక్తి గోక్షీరానికి కానీ ఆ క్షీరం నుంచి కలిగే ద్రవ్యానికి కానీ ఉన్నది. దీనికి సంబంధించి అనేక పరిశోధనలు కూడా తేట తెల్లం చేస్తున్నాయి. అందుకే ప్రతి తల్లీదండ్రీ కూడా వారి పిల్లలకి ఆవుపాలు పట్టడం అనేది ప్రధానంగా అలవాటు చేసుకోవాలి. దేశవాళీ గోవుల క్షీరాన్ని పుచ్చుకున్నట్లయితే తప్పకుండా పిల్లలకు మేధస్సు వృద్ధిచెందుతుంది. ఇంద్రియ పుష్ఠి కూడా కలుగుతుంది. ఇది ప్రతి తల్లిదండ్రీ నిర్ణయించుకుంటే తప్పకుండా ఆవు రక్షింపబడుతుంది. ఆవుయొక్క అవసరాన్ని మనం ఎక్కువగా తెలుసుకోగలిగితే ఆవును రక్షించుకోగలం. ఆవిధంగా రైతులకు కూడా విజ్ఞానం కలిగించాలి. కేవలం పాలు ఇవ్వట్లేదు అని చెప్పి ఎక్కువ సొమ్ముల కోసం ఆవులను అమ్ముకుంటున్నారు. కానీ పాలు ఇవ్వకపోయినా సరే ఆవును మనతో పాటు ఉంచుకుంటే అది ఇచ్చే సంపద ఎంతో అధికము. ఈ పరిజ్ఞానం వాళ్ళకు కలిగించాలి. ఎందుకంటే ఆవు యొక్క పేడ కానీ, గోజలం గానీ వీటికి కూడా ఔషధీగుణములు ఉన్నాయి. పంచగవ్యముల ద్వారా తయారుచేసిన ఔషధములు మొండియైన దీర్ఘకాలిక వ్యాధులను కూడా తొలగిస్తున్నాయి అని వైద్యశాస్త్రంలో ఋజువు అవుతున్న సత్యాలు. అందుకే పంచగవ్య చికిత్సలు కూడా ఎక్కువగా వ్యాప్తి చేయాలి. దీనికి ముందుకు రావలసినవి ధార్మిక సంస్థలు, దేవాలయ సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, మానవుల సంక్షేమాన్ని కోరుకునే సాంస్కృతిక సంస్థలు కూడా ముందుకు రావాలి. వీటి అవసరాన్ని వ్యాప్తి చేయాలి. ఇప్పుడు జాగృతి కలుగుతూ మన భారతదేశంలో అనేక రాష్ట్రాలలో కొంతమంది పంచగవ్య ఉత్పత్తులను తీసుకొస్తున్నారు.

గోవులో ఉన్న జ్ఞానము, గోవులో ఉన్న జీవుడు వేరు. కానీ గోవు శరీరం మాత్రం భగవంతుడి ద్వారా ప్రసాదింపబడింది. ఆ శరీరంలో దేవతా శక్తులు ఉంటాయి. ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. గోవు శరీరంలో ఏ దేవతాశక్తులు ఉన్నాయో గోవుకు తెలియకపోవచ్చు. దానికి ప్రదక్షిణ చేసినట్లయితే దానిలో ఉన్న దేవతల అనుగ్రహం లభిస్తున్నది.

“గోధూళి ధూసరిత కోమల గోపవేషం
గోపాల బాలశతకైః అనుగమ్యమానం
సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్ధం
గచ్ఛంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం!!”

పుష్యమాస విశిష్టత

విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివుడికి కార్తీకం. అలాగే పుష్య మాసం శనీశ్వరుడికి పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు నొసగుతాడని పురాణ ప్రవచనం. ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే్న శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమినాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారం భాగం చేసుకుంటారు. దీనివెనుక శాస్ర్తియ కోణం ఏంటంటే ఈ రెండూ ఓంట్లో వేడిని పెంచి చలి నుంచి రక్షిస్తాయి.
ఈ నెలలో పౌర్ణమినాడు చంద్రుడు పుష్యమీ నక్షత్రానికి సమీపంలో ఉంటాడు కాబట్టి దీన్ని పుష్యమాసం అన్నారు పెద్దలు. పుష్యమాసం తొలి అర్ధ్భాగంలో విష్ణుమూర్తిని పూజించడం అనాదిగా వస్తున్న ఆచారం. పుష్య శుక్ల విదియ నుంచి పంచమి దాకా ఆ హరిని తులసీదళాలతో పూజిస్తే సౌందర్యం లభిస్తుందని నమ్మిక. అలాగే సోమవారాల్లో శివుడిని మారేడు దళాలతోనూ ఆదివారాల్లో సూర్యుణ్ణి జిల్లేడు పూలతోనూ అర్చిస్తారు. శుక్లపక్ష షష్ఠినాడు తమిళులు కుమారస్వామిని పూజిస్తారు. మనకు మార్గశిర శుద్ధ షష్ఠి (సుబ్రహ్మణ్య షష్ఠి) ఎలాగో వారికి ఈరోజు అంత పవిత్రమైనది.
ఇక, శుక్ల పక్షంలో వచ్చే అష్టమినాడు పితృదేవతలను ఆరాధిస్తారు. ఈ మాసంలో శుద్ధ ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుందని విశ్వాసం. ఒక్కోసారి ముక్కోటి ఏకాదశి (వైకుంఠ ఏకాదశి) పుష్యమాసంలో కూడా వస్తుంది. వైష్ణవాలయాల్లో ఉత్తరం వైపు ద్వారం తెరచి ఉంచుతారు. భక్తులందరూ ఆ ద్వారం గుండానే స్వామి వారిని దర్శించుకుంటారు. ప్రత్యక్ష నారాయణుడైన సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించాడనటానికి చిహ్నం ఈ ఉత్తరద్వార దర్శనం. పుష్యమాసంలో వస్తద్రానం విశేష ఫలితాలనిస్తుందని ప్రతీతి. చలితో బాధపడేవారిని ఆదుకోవడమే ఈ నియమం వెనుక సదుద్దేశం.
పుష్యమాసంలో వచ్చే పెద్ద పండుగ సంక్రాంతి. ఇంద్రుడికి ప్రీతికరమైన భోగి పండుగగా ఆచరిస్తారు. తెల్లారకుండానే లేచి చలి మంటలతో చీకట్లను పారద్రోలుతారు. దక్షిణాయనానికీ, ధనుర్మాసానికీ ఆఖరు రోజు ఇది. భోగినాడు వైష్ణవాలయాల్లో గోదారంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా జరుపుతారు. మర్నాడు సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే దినం. మకర సంక్రాంతి.
ఆరోజు నుండీ భక్తులంతా పరమ పవిత్రంగా భావించే ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. సంక్రమణం నాడు రాత్రిపూట భోజనం చేయకూడదని పురాణాలు చెబుతున్నాయి. సంక్రాంతి నాడు శివుడ్ని నేతితోనూ, నువ్వుపూలతోనూ అభిషేకిస్తే దరిద్రం తొలగిపోతుందని, సకల భోగభాగ్యాలూ కలుగుతాయని ప్రతీతి. కనుమ పండుగ చేస్తారు. ఈ రోజు ధనరాశులనూ వ్యవసాయంలో సహకరించే పశువులనూ లక్ష్మీ స్వరూపంగా భావించి, పూజిస్తారు.
పుష్య బహుళ ఏకాదశిని విమలైకాదశి, సఫలైకాదశి, షట్తిలైకాదశి, కల్యాణైకాదశి అని పిలుస్తారు. తెలకపిండితో ఒంటిని రుద్దుకుని నువ్వులు కలిపిన నీటిలో స్నానం చేయడం, నువ్వుల్ని ఆహారంలో భాగం చేసుకోవడం, మంచినీటిలోనూ నువ్వులు కలుపుకొని తాగడం, తిలదానం చేయడం.
ఇలా ఆరు రకాలుగా నువ్వులను ఉపయోగించడం వల్ల ఆ రోజును షట్తివైకాదశి (షట్+తిల+ఏకాదశి) అంటారు. ఈ మాసంలో ఆఖరు రోజైన అమావాస్యను చొల్లంగి అమావాస్య అంటారు. గోదావరి ఏడు పాయ్లో ఒకటైన ‘తుల్యభాగ’ తూర్పుగోదావరిలోని చొల్లంగిలో సముద్రంలో కలుస్తుంది. ఆ రోజున అక్కడ స్నానం చేయడంవల్ల విశేష పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం.

Monday, January 16, 2017

More G.Os - I

Grampanchayat Related Rules

Please click the link
  1. Checque drawing powers in Grampanchayat
  2. IALA guidelines
  3. Election Tribunal
  4. Ts.Ipass rules amendment
  5. Permission for public worship place's changed
  6. G.O.100 on Abadi Lands
  7. -iPass Rules,2015
  8. Building Permission Rules in Muncipalities
  9. Society to Prevent Cruelty to Animals Rules
  10. Slaughtor house Rules
  11. Assigned Land rights
  12. Panchayat Raj Subordinate Service Rules
  13. RTE Rules amendment
  14. A.P.R.T.E Rules
  15. Amendment asper supreme court order for erection of statues
  16. Amendment to Layaout Rules
  17. Social Audit Rules
  18. License for Poultry form in Grampanchayats
  19. Assessment of House tax Rules. (G. O. 30)
  20. Layout and Building Rules
  21. Labor Cess Rules,1998
  22. Rules for erection of statues
  23. PESA Rules
  24. Waste Management Rules 2000
  25. Amendment to mining Rules
  26. Land leveling exemption from senorage
  27. Senorage charges exempted units
  28. D.P.C. Collection of Data for Planning
  29. D,P.C. Planning Guidelines
  30. D.P.C. Meetings Procedure
  31. District Planning Committee Election Rules
  32. Bio-Medical Waste Management Rules
  33. Municipal Solid Waste Rules
  34. AP Sand mining policy
  35. Senorag rates on minor minerals
  36. Birth and Death Rules
  37. Job chart of E.O.P.R&RD
  38. Fundamental ruleson Dissmisal reinstatement
  39. Public information Officers in Panchayat Raj
  40. Income Deduction at Source (TDS) guidelines
  41. Joint Checque Power to Panchayat Secretary
  42. Work bills related rates and wat
  43. 5 kakhs works restored G.O
  44. E procurement for works above 1,00,000/-
  45. Sand Permits Issues power
  46. Panchayat Raj & Rural development Service rules
  47. Panchayat Raj Subordinate Service rules
  48. Powers and Function of Panchayat Secretary
  49. MPDO As Programme Officer
  50. House tax Assessment rules(Old)
  51. E.O.R.D. Service Rules
  52. Grampanchayat meeting Rules
  53. Building & other workers welfare cess rules
  54. A.P.State Audit Rules,2000
  55. Lumpsum Payment by Owner of factory or contiguous group of houses

Grampanchayat Related Acts

Friday, January 13, 2017

ప్రజా ప్రతినిధుల ఆర్థిక అధికారాలలో తారతమ్యం

       

బ్రహ్మం గారి కాలజ్ఞాన అంశాలు

<h2> బ్రహ్మం గారి కాలజ్ఞాన అంశాలు</h2>
  1. వేశ్యల వలన ప్రజలు భయంకర రోగాలకు గురి ఔతారు. మనుషులు వావి వరసలు లేకుండా ప్రవర్తిస్తారు వారికి డబ్బే ప్రధానం ఔతుంది.
  2. రాజులు తమ ధర్మాన్ని మరచి విందులూ వినోదాలలో మునిగి ధర్మ భ్రష్టూలౌతారు.
  3. శాంతమూర్తులకు కూడా కోపం విపరీతంగా వస్తుంది. వివిధ వర్ణాల వారు తమ ధర్మం వదిలి ఇతర ధర్మాలను ఆచరించి నాశనం ఔతారు.
  4. పంటలు సరిగా పండక పాడి పశువులు సరిగా పాలివ్వక భయంకరమైన కరువు సంప్రాప్తిస్తుంది.
  5. బ్రాహ్మణులు తమ ధర్మాలను వదిలి ఇతర కర్మలను ఆచరించటం వలన దేశం కల్లోలితమౌతుంది.
  6. చోళమండలం నష్టాలపాలౌతుంది.
  7. వావి వరసలు గౌరవ మర్యాదలు క్షీణించి తండ్రి కొడుకును కొడుకు తండ్రిని దూషిస్తారు.ప్రజలు కొరువులను నోట పెట్టుకుని తిరుగుతారు.కొడలు మండుతాయి.
  8. జనుల కడుపులో మంటలు పుడతాయి. నోటిలో బొబ్బలు లేస్తాయి. నెత్తురు కక్కుతూ, రోగాల పాలై జనులు మరణిస్తారు. జంతువులూ అలాగే చస్తాయి.
  9. దుర్మార్గులు రాజులౌతారు. మంచి ప్రవర్తాన కలవారు భయంకర కష్టాలపాలై హీనంగా మరణిస్తారు.
  10. మతకలహాలు పెరిగి ఒకరిని ఒకరు చంపుకుంటారు.
  11. అడవి మృగాలు గ్రామాలు పట్టణాలలో ప్రవేశించి మానవులను చంపుతాయి.
  12. నీళ్ళతో దీపాలను వెలిగిస్తారు.
  13. ఇతర దేశస్తులు భారతదేశాన్ని పాలిస్తారు.
  14. మాచర్లలో రాజులంతా ఒక స్త్రీ వలన కలహించుకుని మరణిస్తారు.
  15. పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజల మరణానికి హేతువౌతాయి.
  16. ఒకరి భార్యను ఒకరు వశపరచుకుంటారు. స్త్రీ పురుషులిర్వురూ కామపీడితులౌతారు.
  17. వేంకటేశ్వర క్షేత్రంలో దొంగతనాలు జరుగుతాయి. మహమ్మదీయులు దేవాలయాన్ని దోచుకుంటారు.
  18. ఐదువేల ఏళ్ళ తరువాత కాశీలో గంగ కనిపింకుండా మాయమై పోతుంది.
  19. చెన్నకేశవ స్వామి మహిమలు నాశనమౌతాయి
  20. కృష్ణానది మధ్య బంగారు తేరు పుడుతుంది. అది చూసినవారికి కండ్లు పోతాయి.
  21. ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య క్షీణిస్తుంది.
  22. ఐదువేల ఏళ్ళ తరువాత నేను వీరభోగ వసంతరాయలుగా అవతరించి ధ్ర్మాత్ములను కాపాడి పాపాత్ములను శిక్షిస్తాను. నా భక్తులు తిరిగి నన్ను చేరుకుంటారు.
  23. వెంకటేశ్వరునికి మహమ్మదీయులు కూడా పూజలు చేస్తారు.
  24. కృష్ణా గోదావరి మధ్య పశువులు కూడి మరణిస్తాయి.
  25. తూర్పు నుండి పడమరకు ఒక యోజనము ప్రమాణం వెడల్పుగా ఆకాశంలో చెంగావి చీర కట్టినట్లు కనపడుతుంది.
  26. ఎంతో మందిమార్బలం ఉన్నా రాజులు సర్వనాశనమైపోతారు.గ్రామాలలో చోరులు పెరిగిపోతారు.
  27. పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి.
  28. విచిత్ర వ్యాధులు పుట్టి ప్రజలు కూర్చున్నవారు కూర్చున్నట్లు నిలబడిన వారు నిలబడినట్లు మరణిస్తారు.
  29. రాత్రింబవళ్ళు గద్దలు గుంపులు గుంపులుగా కూడి అరుస్తాయి. నీటిలోని చేపలు తామ చస్తామని పలుకుతూ వెలుపలికి వస్తాయి.
  30. శ్రీశైల పర్వతానికి ఒక ముసలి వస్తుంది. అది భ్రమరాంబ గుడిలో దూరి ఎనిమిది రోజులుండి మేకలా కూసి మాయమౌతుంది.
  31. శ్రీశైలంలో అగ్ని వర్షం పుడుతుంది. గుగ్గిళ్ళ బసవన్న(నందీశ్వరుడు)రంకెలు వేస్తాడు ఖణ ఖణమని కాలు దువ్వుతాడు.
  32. సూర్యమండలం నుండి మాటల రూపంలో శబ్దం వినపడుతుంది.
  33. విషవాయువు కొట్టినప్పుడు శివునికంట నీరు కారుతుంది.
  34. గ్రామాలలో పట్టణాలలో నెత్తుటి వానకురుస్తుంది.
  35. సూర్య్డు చంద్రుడు ఉన్నంతకాలం నా మఠానికి పూజలు జరుగుతాయి. నా మఠానికి ఈశాన్యంలో ఒక చిన్నదానికి ఒక చిన్నవాడు పుడతాడు. అతడు నేనే దేవుడినని నన్ను పూజించండి అని పలుకుతాడు.
  36. నెల్లూరు సీమ మొత్తం నీట మునుగుతుంది.
  37. విచిత్రమైన ఈత చెట్టు ఒకటి పుట్టి రాత్రులు నిద్రపోతూ పగలు లేచి నిలబడుతుంది.అలా ఏడెనిమిది సంవత్సరాలు ఉండి ఆ చెట్టు నశిస్తుంది.అది మొదలు దేశంలో తీవ్రమైన కరువుకాటకాలు ఏర్పడతాయి.
  38. ఈ కలియుగంలో 5097 సంవత్సరంలో ఎన్నో విశేషాలు జరుగుతాయి.ఆధాతృనామ సంవత్సరంలో అనేక ఊళ్ళలో రూపాయికి చిట్టెడు బియ్యం అమ్ముతారు.జనులు అరచి అరచి చస్తారు.
  39. కలియుగం 5000 సంవత్సరాలు గడిచేసరికి గరిమిరెడ్డి అచ్చమ్మ వంశంలో ఎవరూ మిగలరు ఆ వంశానికి ఆస్తి అయిన గోవులలో ఒక్క గోవుకూడా మిగలదు.
  40. బనగాన పల్లె నవాబు పాలనకూడా క్రమంగా నాశనమౌతుంది. అతనికి వచ్చే ఆదాయం క్షీణిస్తుంది.
  41. నేను శ్రీ వీరభోజ్యుడినై ఈ ప్రపంచంలో ఉద్భవిస్తాను. కలియుగం 5000 సంవత్సరములు గడిచిన తరువాత దుష్ట శిక్షణ శిష్ట రక్షనార్ధం వస్తాను.

నేను వచ్చే ముందు సంభవించే పరిణామాలు విను.

  1. ఉప్పుకొడూరులో ఊరచెరువులో ఉత్పాతాలు పుడతాయి. నిజాయితీతో వ్యాపారం చేసే వర్తకులు క్షీణించి పోతారు.
  2. 14 నగరాలను జలప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావటానికి ఇది ప్రబల నిదర్శనం.
  3. నాలుగు వర్ణాల వారు గతి తప్పి నడుస్తారు. దేశంలో పెద్ద పొగమేఘం కమ్ముకుంటుంది. ప్రజలు దానిలో చిక్కుకుని మరణిస్తారు.
  4. 5972 ధాతు నామ సంవత్సరాన మాఘ శుద్ధ బుధవారం రోజున పట్ట పగలే 18 పట్టణాలు దోపిడీకి గురౌతాయి.
  5. కోటిదూపాటిలో కొచ్చర్లకోటలో కోడి మాట్లాడుతుంది. జనులలో అత్యధికులు ఇచ్చిన సొమ్ము దిగమ్రింగి అబద్ధాలాడి బాకీలు ఎగకొడతారు.
  6. కోమటి కులంలో 25 గోత్రాలవారు మాత్రం మిగిలి ఉంటారు. ఉత్తర దేశంలో ఉత్తమ భేరీ కోమటి మహాత్ముడై నిలుస్తాడు. ఆ కోమటిని ప్రపంచమంతా కీర్తిస్తారు.
  7. మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది.
  8. పట్ట పగలు ఆకాశంలోనుండి పిడుగుల వాన పడి నిప్పుల వాన కురుస్తుంది. అందులో కొందరు మరణిస్తారు.
  9. పంది కడుపున ఏనుగు పుడుతుంది. మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుంది.
  10. బనగాన పల్లెలో కాలజ్ఞాన పాతర మీద వేపచెట్టుకు చేమంతిపూలు పూస్తాయి.
  11. గుణవంతులందరూ బనగానపల్లె చేరుకుంటారు. బనగాన పల్లె నవాబు కొంతకాలం మాత్రమే పాలన చేస్తాడు.ఆ తరువాత బనగాన పల్లెను ఇతరరాజులు స్వాధీనపరచుకుంటారు.
  12. అద్దంకి నాంచారమ్మ ముందుగా మాట్లాడుతుంది.అందువల్ల ఎందరో నష్టపోతారు.
  13. గోలుకొండ నుంచి ఇద్దరు పిల్లలు పట్టణం ఏలుతారు.
  14. మహానంది మరుగున మహిమలు పుడతాయి.
  15. నేను రాబోయే ముందు ఒక చిత్రం జరుగుతుంది. దానిని గుర్తించిన వారిని నేను రక్షిస్తాను. నాలుగు నిలువుల ఎత్తుగల ఆజానుబాహువులు మేమే వీరభోజ వసంతరాయలమని చెబుతారు. నిజమైన భక్తులు ఈ మాటను నమ్మరు. మూఢులు మాత్రం నమ్ముతారు.
  16. మరొక విచిత్రం పుడుతుంది. వీపున వింజామరలు అరికాలున తామరపద్మం కలిగినవారు వస్తారు. వారిని చూసి నేనని భ్రమపడవద్దు. నారాకకు గుర్తు ఏమిటంటే కందిమల్లయ పల్లెలో నవరత్న మండపం కడతారు. ఆ పల్లెపెరిగి పట్టణంగా మారుతుంది.
  17. కంచి కామాక్షమ్మ కన్నులవెంట నీరు కారుతుంది. ఈ సంఘటన తరువాత వందలాది మంది మరణిస్తారు.
  18. ఆవు కడుపులోని దూడ అదేవిధంగా బయటకు కనిపిస్తుంది.
  19. పిల్లలు లేని స్త్రీలకు పిల్లలు పుడతారు.
  20. కృష్ణ గోదావరుల మధ్య మహాదేవుడను పేర శైవుడు జన్మించి మతభేదం లేక గుడులూ గోపురాలు నిర్మించి పేరు ప్రఖ్యాతులు పొందుతాడు. ఊరూరా గ్రామ దేవతలు ఊగిసలాడతారు.
  21. కాశీ కుంభకోణ గోకర్ణ క్షేత్రాల మహిమలు తగ్గి పోతాయి. కంచి మహత్యం మాత్రం పెరుగుతుంది.
  22. ఆనంద నామ సంవత్సరాలు పదమూడు గడిచేవరకూ ఈ నిదర్శనాలు కనిపిస్తుంటాయి.
  23. పతివ్రతలు పతితలౌతారు. వావి వరసలు పాటించకుండా ప్రవర్తిస్తారు. ఆచారాలన్నీ సమసి పోతాయి.
  24. రాయలవారి సింహాసనం కంపిస్తుంది. కురుమ సంతతి రాజులందరినీ జయించి దక్షిణంగా బోయి రామేశ్వరం దిక్కున రాయల దళాలను తరిమి యుద్ధాలు చేసి నర్మదానదిలో కత్తులు కడిగి కాశీకి వచ్చి రాయల తల చూస్తారు. ఈ సమయంలో హస్థినాపురిలో మహామారి అనేశక్తి పుడుతుంది. రామేశ్వరం వరకు ప్రజలను నాశనం చేస్తుంది. రాయలు విజయనగరం పాలించే సమయంలో గజపతులతో పోరు జరుగుతుంది.
  25. శ్రీశైల క్షేత్రాన కల్లు, చేపలు అమ్ముతారు. వేశ్యాగృహాలు వెలుస్తాయి. మందుమాకులకు లొంగని వ్యాధులు ప్రబలుతాయి. స్త్రీ పురుషులంతా దురాచార పరులౌతారు. స్త్రీలు భర్తలను దూషిస్తారు.
  26. ఢిల్లీ ప్రభువు నశించిపోతాడు.
  27. వైష్ణవ మతం పైకి వస్తుంది. శైవ మతం తగ్గి పోతుంది. నిప్పుల వాన కురుస్తుంది. గుండ్లు తేలుతాయి. బెండ్లు మునుగుతాయి. చివరకు శివశక్తి అంతా లేకుండా పోతుంది.
  28. విజయనగరాన కోటలో రాయల సింహాసనం బయట పడుతుంది. ఇందుకు గుర్తుగా గ్రామంలో రాతి విగ్రహాలు ఊగిసలాడతాయి. అప్పుడు బిజ్జల రాయుని కొలువులో రాయలసింహాసనం బయట పడుతుంది.

ఇలా బ్రహ్మంగారు కడపనవాబుకు కాలజ్ఞానంబోధించి, మంత్ర దీక్ష ఇచ్చి ఆశీర్వదించాడు.

Pages: 1 2

Featured Post

Action Taken on the Recommendations Made by the Sixteenth Finance Commission

GOVERNMENT OF INDIA Explanatory Memorandum as to the Action Taken on the Recommendations Made by the Sixteenth Finance C...

Popular Posts